అరె ఛీ.. ఏంట్రా ఈ డబుల్ మీనింగ్ డైలాగులు!
on Aug 9, 2022
డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి అంతూ పొంతూ లేకుండా పోయింది. బుల్లితెర షోస్ లో ఇలాంటి డైలాగ్స్ ఉంటేనే షోకి రేటింగ్ పెరుగుతుంది అని వాటినే ఎక్కువగా పెడుతున్నారు. ఈ వారం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టూ మచ్ డైలాగ్స్ తో ఆడవాళ్లు తల దించుకునే స్థాయికి తీసుకెళ్లారు. రీసెంట్ గా ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీలో "నా కొడుకు" టైటిల్ తో ఒక ఈవెంట్ చేశారు. ఈ ఎపిసోడ్కు గెస్టుగా సీనియర్ కమెడియన్ కృష్ణభగవాన్ వచ్చాడు. 'ఎఫ్3' మూవీ కాన్సెప్ట్ ప్రకారం తప్పిపోయిన కొడుకుని తిరిగి పట్టుకునే థీమ్ అంటూ నానా హంగామా చేశారు. తర్వాత ఒక రూపాయిని పది రూపాయలు చేసే బిజినెస్ తెలివితేటలు ఉన్నాయని కృష్ణ భగవాన్ చెప్పడంతో మరో స్కిట్ వేశారు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నాటీ నరేష్.
ఇందులో ఒక్కొక్కొరు ఒక్కో వ్యాపారం చేస్తుంటారు. ఆది మూలికల వ్యాపారం చేస్తుంటాడు, ఇమాన్యుయేల్ పీచు మీఠాయిలు అమ్ముతూ ఉంటాడు. రాంప్రసాద్ కూరగాయల బిజినెస్ చేస్తుంటాడు. వీళ్ళ బిజినెస్ ని చూసి కొనడానికి నాటీ నరేష్ వచ్చి తన పరువు తానే తీసేసుకుని అందరినీ తలదించుకునేలా చేస్తాడు. రాంప్రసాద్ కూరగాయల దగ్గరకు వచ్చి "దొండకాయను చూపించి ఏంటి ఇది ఇంతే ఉంది?" అంటూ డబుల్ మీనింగ్లో అంటాడు. "ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా?" అని నరేష్ ని ఇంకా రెచ్చగొడతాడు రాం ప్రసాద్. వీళ్ళ డైలాగ్స్ వినలేక ఇంద్రజ సిగ్గుతో తలదించుకుంటుంది. చివరికి పంచ్ ప్రసాద్ వచ్చి అందరినీ తిడతాడు.
ఏదో చేద్దామని అనుకుని కానీ ఏమీ చేయలేక తెల్ల ముఖాలు వేసుకుని నిలబడ్డారు. నరేష్ స్పాంటేనిటీగా ఏదో చేద్దామని వచ్చి ఏది చేయలేక ఉన్న పరువు, లేని పరువు, అప్పు చేసిన పరువు కూడా పోగొట్టుకున్నాడు. ఇలా ఈ స్కిట్ అయ్యిందనిపించారు.
Also Read